Search Blogger

Friday, 30 November 2018

ఈ లోకంలో ఏది నిన్ను రక్షించదు తెలుసా?: నిన్ను రక్షించెవాడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే


Jeremiah(యిర్మీయా) 9:23,24
23.యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుజ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు.
24.​అతిశ యించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతి శయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
దేవుడు తన భక్తుడైన యిర్మీయా ద్వారా మనతో మాట్లాడుతున్నారు
అతిశయించడం వల్ల మన జీవితానికి ప్రమాదం ఉందని ఆ ప్రమాదం మనకు జరగకూడదని దేవుడు ముందుగానే యిర్మీయా ద్వారా నీవు అతిశయింపకూడదు అని మనతో మాట్లాడుతున్నారు.
ఒక వేళ
నీకున్న అందాన్ని బట్టి అతిశయింస్తున్నావా?
అందం మోసకరం సౌందర్యం వ్యర్థం అని దేవుని వాక్యం చెపుతుంది.
నీ అందం నిన్ను రక్షించదు తెలుసా.
నీకున్న బలాన్ని బట్టి అతిశయింస్తున్నావా?
బలవంతుడైన ఐగుప్తు రాజైన ఫరో అతని సైన్యం సముద్రం లో మునిగిపోయారు.
అతని బలం అతనిని రక్షించలెేకపోయింది.
బలవంతుడైన సమ్సోను ఫిలిష్తీయుల చెతిలో తన రెండు కల్లు పోగొట్టుకున్నాడు.
అతని బలం అతనిని రక్షించలెేకపోయింది.
బలవంతుడైన గొల్యాతు చిన్న వాడైన దావీదు చేతిలో తన ప్రాణం పోగొట్టుకున్నాడు.
అతని బలం అతనిని రక్షించలెేకపోయింది.
నీ బలం నిన్ను రక్షించదు తెలుసా.
నీకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయింస్తున్నావా?
జ్ఞానవంతుడైన సొలొమోను తన భార్యలు అతనితో విగ్రహారాధన అనే పాపం చేయించారు.
విగ్రహారాధన అనే పాపం చేయకుండా అతని జ్ఞానం అతనిని రక్షించలెేకపోయింది.
నీకున్న జ్ఞానం నిన్ను రక్షించదు తెలుసా.
నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింస్తున్నావా?
(యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక ఉపమానం చెప్పారు.)
Luke(లూకా సువార్త) 12:16,17,18,19,20
మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను.
17.అప్పుడతడునా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొనినేనీలాగు చేతును;
18.నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తినిసమకూర్చుకొని
19.నా ప్రాణముతోప్రాణమా, అనేక సంవత్సరములకు,విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందునను కొనెను.
20.అయితే దేవుడువెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని ఆతనితో చెప్పెను.
అతని ఐశ్వర్యం అతనిని రక్షించలెేకపోయింది.
నీ ఐశ్వర్యం నిన్ను రక్షించదు తెలుసా.
ఈ లోకంలో నీకున్న ఏది నిన్ను రక్షించదు.
తన కృప చేత రక్షించి నరకం నుండి తప్పించి నిత్యజీవాన్ని ప్రశాదించేది యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే
ఆయన మాత్రమే నిన్ను రక్షించగలడు. ఎందుకంటే నీ పాపాలకు పరిహారం చెల్లించినవాడు ఆయనే.
భూమిమీద మనుషులందరికి రక్షణ అనే కృపను అనుగ్రహించినవాడు ఆయనే.
గనుక అతిశయించువాడు ఆయనను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను.
క్రీస్తుకు పూర్వం అలెగ్జాండర్ తన తండ్రి చనిపోతే పదహారేళ్ళ వయసు లో రాజయ్యాడు.
మరో పదహారేళ్లు యుద్ధం చేసి రాజ్యాలను జయించి ఇంటికి తిరిగి వస్తుండగా అనారోగ్యానికి గురై ముప్పై రెండు సంవత్సరాల వయసు లో మరణించాడు.
ఆయన మరణించడానికి కొంత సమయం ముందు ఒక నిజం తెలుసుకున్నాడు.
అలెగ్జాండర్ చాలా రాజ్యాలను జయించిన తర్వాత ఇంటికి తిరిగి వెళుతున్నాడు. మార్గమధ్యంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణ శయ్యపై చేరాడు. తాను మరణించడం తథ్యమని అలెగ్జాండర్ కు అవగతమైపోయింది.తాను సాధించిన గొప్ప గొప్ప విజయాలు, అమిత శక్తిశాలురైన  సైన్యం, అంతులేని సంపద తన్ను మరణం నుంచి దూరం చేయలేవని స్పష్టమైపోయింది.
ఇంటికి వెళ్ళాలనే కోరిక తీవ్రతరమైంది. తన తల్లికి కడసారిగా తన ముఖాన్ని చూపించి కన్ను మూయాలనే ఆశ. కానీ సమయం గడిసే కొద్దీ దిగజారుతున్న అతని ఆరోగ్యం అందుకు సహకరించడం లేదు. నిస్సహాయంగా ఆఖరి శ్వాస కోసం ఎదురు చూస్తున్నాడు. తన సైన్యాధికారులను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు.
“నేనింక కొద్దిసేపట్లో ఈ లోకం నుంచి నిష్క్రమించబోతున్నాను. నాకు చివరగా మూడు కోరికలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నెరవేర్చకుండా విస్మరించకండి.” అని వారి నుండి వాగ్ధానం తీసుకున్నాడు.
అశ్రు నయనాలతో కడసారిగా తమ రాజు గారి ఆజ్ఞను వినమ్రంగా అంగీకరించారు ఆ అధికారులు.
నా మొదటి కోరిక:  ” నా శవ పేటికను కేవలం నా వైద్యులు మాత్రమే మోయాలి”
రెండవ కోరిక: “నా పార్థివ దేహం  స్మశానానికి వెళ్ళే దారిలో నేను సంపాదించిన విలువైన వజ్రాలు, మణి మాణిక్యాలు పరచండి”
మూడవ కోరిక: “శవపేటిక లో నుంచి నా ఖాళీ చేతులు బయటికి కనిపించే విధంగా ఉంచండి”
చుట్టూ మూగి ఉన్న సైనికులు ఆయన విచిత్రమైన కోరికలు విని ఆశ్చర్యపోయారు.కానీ వారిలో ఎవ్వరికీ ఆయన్ను అడిగే ధైర్యం లేకపోయింది. అలెగ్జాండర్ కు అత్యంత ప్రీతి పాత్రుడైన ఒక సైనికుడు దగ్గరగా  వచ్చి, ఆయన చేతులను ముద్దాడి, ఆయన కోరికలను తప్పక నెరవేరుస్తామని మాట ఇచ్చాడు. ఈ కోరికల వెనక ఆంతర్యమేమిటో సెలవియ్యమని అడిగాడు.
అలెగ్జాండర్ అతి కష్టమ్మీద ఇలా అన్నాడు. “ఈ మూడు కోరికలు నేనిప్పుడే నేర్చుకున్న మూడు పాఠాలకు ప్రతిరూపాలు.”
“మొదటి కోరికలో నా ఆంతర్యం, నిజానికి ఏ వైద్యుడూ మరణాన్ని ఆపలేడు . ఒకవేళ  వైద్యం చేసినా వల్లకాటి వరకే.” అని చెప్పడానికి.
“రెండవ కోరికలో నా ఆంతర్యం, నా జీవితంలో సగం భాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది.అదేదీ నా వెంట తీసుకెళ్ళలేక పోతున్నాననీ, కేవలం సిరిసంపదల వెంటబడి విలువైన సమయాన్ని, జీవితంలో మాధుర్యం కోల్పోవద్దని చెప్పడానికి”
“మూడవ కోరికలో నా ఆంతర్యం ఈ ప్రపంచంలోకి నేను వచ్చేటపుడు వట్టి చేతులతో వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే ”
అని చెప్పి కన్ను మూశాడు.
అలెగ్జాండర్ జీవితం మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తుంది.
ఇక్కడ విడిచి పెట్టవలిచిన వాటిగురించి ప్రయాస పడడం వల్ల ప్రయోజనం లేదు కానీ
భూమి మీద కృప చూపే దేవుడు ఆయనే అని పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి ప్రయోజనం ఉంటుంది.
నేడే తెలుసుకో
యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించు
నరకం అనే రెండోవ మరణం నుండి తప్పించబడి నిత్యజీవము పొందుకో.
అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయును గాక.
God bless you.


Tuesday, 25 September 2018

యవనస్తుల దేవుని ఆశీర్వాదం ఎలా పొందు కోవాలి

మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి గల నామములో మీకు శుభములు.
యవనస్తులు దేవుని ఆశీర్వాదాన్ని ఎలా పొందు కోవాలి అనే విషయం గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథము లో నుండి కొన్ని వచనాలు చూద్దాం.
Ephesians(ఎఫెసీయులకు) 6:1,2,3

1.పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే.
2.నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము,
3.అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.

అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసులో దేవుని సంఘం లో ఉన్న యవనస్తులకు ఈ మాటలను తెలియజేశారు.
ఎఫెసు సంఘము లో యవనస్తులు ఎలా ఉన్నారు అంటే తల్లిదండ్రులకు ఏమాత్రం విధేయులుగా లేకుండా
తల్లిదండ్రుల మాట వినని వారు గా
తల్లిదండ్రులను బాధపెట్టే వారు గా ఉండి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేని వారు గా అక్కడ యవనస్తులు ఉన్నారు.
అందుకే పౌలు గారు ఈ మాటలను వారికి తెలియజేస్తున్నారు.
యవనస్తులైన మీరు దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి అంటే
మీకు మేలు కలగాలి అంటే
మీ జీవితంలో మీకు అంతా మంచి జరగాలి అంటే
మీరు మొదటిగా ఈ రెండు పనులు చేయాలి.
1) తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి
2) తల్లిదండ్రులను ప్రేమ తో గౌరవించాలి

ఒక్కసారి మనము (ఎఫెసీయులకు)6:1వచనాన్ని గమనిద్దాం

పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే.
అని దేవుని వాక్యము తెలియజేస్తుంది.
ధర్మము అంటే న్యాయం, అధర్మం అంటే అన్యాయం అని అర్ధం.
న్యాయంగా జీవించే వారిని చూసి అందరూ సంతోషిస్తారు
అందరూ మెచ్చుకుంటారు.
దేవుడు సంతోషిస్తాడు దేవుడు కూడా మెచ్చుకుంటాడు.
అన్యాయంగా జీవించే వారిని చూసి అందరూ అసహ్యించుకుంటారు, దేవుడు కూడా అసహ్యించుకుంటాడు.
మీ తల్లిదండ్రుల మాట వింటూ వారికి విధేయులై మీరు జీవిస్తుంటే
మీరు న్యాయంగానే జీవిస్తున్నారు.
వారి మాట వినకుండా వారికి అవిధేయులై మీరు జీవిస్తుంటే అన్యాయంగా జీవిస్తున్నారు.
ఈ మాట నేను చెప్పడం లేదు దేవుని వాక్యము తెలియజేస్తుంది.

ఈ లోకంలో నీవు ఎక్కడికి వెళ్ళినా నీకు మంచి జరగాలంటే
నీకు విధేయత చాలా అవసరం కాబట్టి మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండటం మీరు నేర్చుకుంటే విధేయత కలిగి జీవించడం మీకు అలవాటు అవుతుంది.
అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు అంతా మంచి జరుగుతుంది.
2) తల్లిదండ్రులను సన్మానించాలి.
సన్మానించడం అంటే, ప్రేమతో గౌరవించడం.
నీ తల్లిదండ్రులను నీవు ప్రేమతో గౌరవించినప్పుడు నీవు దీర్ఘాయువును పొందుకుంటావు.
నీవు అనుకున్నది జరగాలంటే, నీ కల నెరవేరాలంటే, నీవు తలపెట్టిన ప్రతి కార్యం సఫలం కావాలంటే,
నీకు మంచి జరగాలి.
నీవు దీర్ఘాయువు తో జీవించాలి.
వీటిని దేవుడే నీకు ఇవ్వాలి, దేవుడు నీకు వీటిని ఇవ్వాలంటే నీవు దేవుని వాక్యప్రకారంగా జీవించాలి.
దేవుని వాక్యము ఏం చెప్తుంది,
మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, మీ తల్లిదండ్రులను సన్మానించాలి అని.
దేవుని మాట చొప్పున జీవించినప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని పొందుతారు.
అబ్రాహాము ఆశీర్వదించబడడానికి కారణం విధేయత.
ఇస్సాకు ఆశీర్వదించబడడానికి కారణం విధేయత.
యాకోబు ఆశీర్వదించబడడానికి కారణం విధేయత.
యోసేపు ఆశీర్వదించబడడానికి కారణం విధేయత.
దేవుని వాక్యమునకు విధేయులుగా జీవించినప్పుడు,
తల్లిదండ్రులకు విధేయులుగా జీవించినప్పుడు,
దేవుని సేవకుడిని పెద్దలను నీవు గౌరవించినప్పుడు,
తల్లిదండ్రులను ప్రేమతో గౌరవించినప్పుడు,
నీవు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతావు.

యవనస్తులు అందరూ దేవుని వాక్యానికి లోబడి
తల్లిదండ్రులకు విధేయులై, తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తూ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశిస్తున్నాను.
అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయును గాక.

Pastor P.Barnabas

Saturday, 22 September 2018

Christian images

Christian images

Christian images

Christian images

Christian images

Christian images

Christian images

Christian images

Christian images

Christian images

Christian images

Christian images

Christian images

Christian images

Christian images

Christian images

మనకొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు



మార్కు15:15. పిలాతు జనసమూహను సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయనప్పగించెను. యేసుక్రీస్తు ప్రభువు ఇశ్రాయేలియులను యూదులను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చారు. ఏ జాతి కొరకు ఆయన వచ్చారో వారే ఆయనను నిర్లక్ష్యం చేసి ఆయనకు శిక్ష విధించి పాపాత్ముడు నరహంతకుడునునైన బరబ్బను విడుదల చేయాలని కోరుకున్నారు. ఆయనకు శిక్ష పడెలా కోరింది ఎవరు? మార్కు15:1, ఉదయము కాగానే ప్రదానయాజకులును పెద్దలును శాస్త్రులును మహసభవారందరును కలిసి ఆలోచన చేసి, యేసును బంధించి తీసికొనిపోయి పిలాతునకు ఆప్పగించిరి. 1)యాజకులు 2)పెద్దలు 3)శాస్త్రులు యాజకులు అంటే యాజకత్వం చేసేవారు (దేవుడికి దూపం హారతి నైవేద్యం అర్పించెవారు) ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు గురించి తెలిసిన వారు. పెద్దలు అంటే, మంచి చెడులు తెలిసి ఏది చేయాలో ఏది చేయకూడదో నిర్ణయం తీసుకునే వారు. శాస్త్రులు అంటే, తెలివైన వారు జ్ణానవంతులు పండితులు. ఈ ముగ్గురు కూడా చాలా గొప్ప వారు అయినా సరే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న దైవత్వం చూడలేక పోయారు, తెలుసుకో లేక పోయారు. యేసుక్రీస్తు ప్రభువును వారు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే వారు యేసుక్రీస్తు ప్రభువును నిర్లక్ష్యం చేసారు. కాబట్టి ఆయన సర్వమానవుల రక్షణ కొరకు ఆయన తన రక్తాన్ని చిందింసారు. ఈ విషయం తెలియక అప్పటి వారు చేసిన విధంగానే ఈ రోజుల్లో ప్రజలు కూడా పరిశుద్దుడైన యేసుక్రీస్తు ప్రభువును నిర్లక్ష్యం చేసి పాపాన్ని కోరుకుంటున్నారు. వారు ఈ యేసు మాకొద్దు బందిపోటు దొంగ నరహంతకుడు నైన బరబ్బ మాకు కావాలి అన్నారు. అప్పటికి బరబ్బ ఖైదీ గా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎప్పుడు అన్యాయం చేయలేదు, వారిపట్ల ఆయన ఎన్నో అద్భుతకార్యలు చేసారు. గ్రుడ్డి వారికి చూపును, చెవిటి వారికి వినికిడిని. మూగవారికి మాట్లాడే శక్తిని, ఇలా ఎన్నో అద్భుతకార్యలు వారిపట్ల ఆయన చేసారు. రోగాలనుండి వారిని విడిపింసారు, దయ్యాలనుండి వారిని విడిపింసారు, చనిపోయినవారిని కూడా ఆయన బ్రతికింసారు, ఆయన వారికి ఆహారం కూడా పెట్టారు. ఆయన వారిని ప్రేమించి ఇన్ని కార్యాలు వారిపట్ల చేస్తే, వారు,వారిని బాధ పెట్టి దోచుకోని వారిని హింసకు గురి చేసి శ్రమపెట్టి వారిప్రాణాలు తీసిన నరహంతకుడైన బరబ్బను మాకు విడుదల చేసి ఈ యేసును సిలువ వేయమని వారు కోరుకుంన్నారు. ఈ దినాలలొ మనము ఎలా ఉన్నాము మన కొరకు ప్రాణం పెట్టిన మన రక్షకుడు నైన ఆ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు రాకుండా ఆయనను నిరాకరిస్తు, ఆనాటి యూదుల వలె వారు బరబ్బను కోరుకుంనట్లుగా, నీవు కూడా నాశనానికి నడిపించే ఈ లోకాన్ని కోరుకుంటున్నావా. ఈ లోకం పాపము తో నిండి ఉంది, ఈ లోకంలో పుట్టిన మనుష్యులందరు పాపులె. అందుకే భక్తుడైన పౌలు అంటున్నాడు, రోమా3:23,లొ ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేక పోవుచున్నారు. రోమా3:11,12,లొ నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు, అందరును త్రొవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ఈ పాప లోకంలో ఉన్న అందరు పాపులె, పాపము తో ఉన్న మనము పరిశుద్దుడైన దేవుణ్ణి ఎలా చూడగలము, ఆ దేవుడుండె పరలోక పట్టణం, ఆ స్వర్గమనే మహ నగరం ఎలా చూడగలము, ఎలా చేరుకోగలము? మనము ఆ ప్రభువును చూడాలంటే ఆ పరలోకం ఆ స్వర్గంలో ఉండాలంటే, మన పాపాలు క్షమించబడి మనము నీతిమంతులుగా తీర్చబడాలి. మనలను నీతిమంతులుగా చేసేది ఎవరు? రోమా3:24-26వరకు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనుపరచవలెనని! క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటికాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను. ఈదినమే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు దగ్గరకురా, ని పాపాలు క్షమించబడతాయి నిత్యజీవం నీవు పొందుకుంటావు.
అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయును గాక.
God bless you

ఉపవాసం లో ఉన్న శక్తి

ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే 
మనము ఆత్మీయంగా బలపడడానికి 
దేవునికి మరింత దగ్గర కావడానికి 

మనము దేవునికి దగ్గరగా ఉంటే, 
సాతానుకు దూరంగా వుంటాం 
దేవునికి దగ్గరగా లేకపోతే 
సాతానుడు మనము రమ్మనకుండానే వాడే మన దగ్గరకు వచ్చేస్తాడు, 

మనము కడవరి కాలంలో భయంకరమైన 
దినాలలో ఉన్నాము, 
దేవుని యొక్క రాకడకు అతి సమీపంలో మనము ఉన్నాము, 

ఈ యుగం సమాప్తి కాబోతుంది 
ఈ లోకానికి దేవుడు తీర్పు తీర్చడానికి ఆయన త్వరగా రాబోతున్నాడు 
మనమందరం ఆ తీర్పు లో లేకుండా ఉండాలంటే, 
మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి 
ఆయనకు దగ్గరగా మనము జీవించాలి. 

1 పేతురు 5:8,9, వచనాలు 
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీవిరోదియైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.

అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు 

మన విశ్వాసాన్ని పాడుచెయాలని, 
మన భక్తి జీవితాన్ని నాశనం చేయాలని, 
మనలో భేదాలు పుట్టించి కక్షలు, అసూయ, స్వార్థాన్ని పుట్టించి మనలను దేవునికి దూరం చేసి వాడితోపాటు మనలను కూడా నరకానికి తీసుకుపోవలని వాడు తిరుగుచున్నాడు, 

అందుకే దేవుడు భక్తుడైన పేతురు ద్వారా మనతో మాట్లాడుతున్నారు, 
మీరు వానిని ఎదిరించండి అని ఆయన మనతో మాట్లాడుతున్నారు, 

మనము అపవాదిని ఎదిరించాలి 
మనము అపవాదిని ఎదిరించాలంటె మనకు 
బలం కావాలి, శక్తి కావాలి,
మనకు బలం కావాలంటే మనము ఆత్మీయ
ఆహారం తీసుకోవాలి

అపవాదిని ఎదిరించడానికి దేవుడు మూడు మాటలు చెప్పారు. 

1) నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై ఉండాలి. 
2) మెలకువగా ఉండాలి. 
3) లో కమందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. 
4) విశ్వాసమందు స్థిరులై ఉండాలి.

1) నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై ఉండాలి
వాడు మనలను మోసపరచడానికి 
రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు
ఏదో ఒక వెర్రి చూపిస్తూ ఉంటాడు 

వాడి ప్రయత్నాలకు మనము లొంగిపోకుండా
నిబ్బరమైన మనస్సు గలవారమై దేవుని మీద అనుకోవాలి

వాడు ఏదేనులొ అదాము అవ్వను ఇలాగే మోసం చేసాడు 

2) మెలకువగా ఉండాలి 
   మత్తయి 25:1-13 వరకు 

3) ఏం జరుగుతుందో తెలుసుకోవాలి
  అలాగని ప్రతి చెత్త విషయాలు కాదు
  ఏం తెలుసుకోవాలి మనము అంటే 
  మత్తయి 24:3-8, వరకు 
  
4) విశ్వాసమందు స్థిరులై ఉండాలి
    యోహను 4:46-53 వరకు 
    మార్కు 5:21-43 వరకు 

దేవుడు మనపక్షమునుండగా మనకు విరోధి ఎవడు?

Romans(రోమీయులకు) 8:31 ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?